జానకమ్మ చాలా గంభీరురాలు . ఇప్పుడు రాజకీయాలలో పని చేసే వారికి గల పలుకుబడి ఆమెకి తెలుసు. తన పినతండ్రి కూతురైన సుభద్ర మూడు మాసాల పాటు శిక్ష కూడా అనుభవించి రావడం వల్ల, ఎక్కడికి వెళ్లినా చాలా గౌరవం పొందుతోంది. జానకమ్మ రాజకీయంలోకి దిగితే తనకి కూడా అసాధారమైన ఆధరగౌరవాలు లభిస్తాయి అనేది తన అభిప్రాయం.