మహారాజశ్రీ పుల్లంరాజు చక్రవర్తిగారి పరిపాలన విశేషాల్ని ఈ కథలో వివరించారు. చక్రవర్తి ఒకసారి గుర్రపు పంద్యాలు చూడటానికి మరికొన్ని పనులు మీద బొంబాయి వెళ్లి పది రోజులున్నారు. అతను ఉన్న పది రోజులూ అక్కడ సభలు ఘనంగా జరిగాయి. అతనికి అన్నిటికంటే అస్పృశ్యతా నివారణ సభ చాలా బాగా నచ్చింది. అక్కడ గ్రహించిన విషయాలని తన అధికారంలో అమలుపరచాలని అనుకుంటారు. తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ఈ కథని వినండి.