శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథ 'మాదిగపల్లె ' ఉన్నత కులానికి చెందిన బ్రాహ్మణుడు, మాదిగల మధ్య కాపురం చెయ్యడానికి వెళ్తాడు. వాళ్లతోనే వుండి వాళ్లని ఉద్ధరించడానికి, వాళ్లకు సరైన సలహాలు ఇవ్వడానికి నిశ్చయించుకుంటాడు. అక్కడి కులపెద్దలతో కూడా మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు.