అమలాపురం హైస్కూలులో చదివి పాస్సయ్యి , స్వగ్రామంలో నౌకరీ దొరుకుందేమో అని ప్రయత్నం చేసి ... కుదరకపోవడంతో నగరానికి వెళ్తాడు ఒక బ్రాహ్మణుడు. అక్కడ ఉద్యోగం దొరుకుతుంది. నెలకి ఇరవై ఐదు రూపాయలతో మొదలైన తన ఉద్యోగం సంవత్సరం తర్వాత ముప్పై ఐదు రూపాయలకు చేరింది. తర్వాత సూరిరావు మరియు సుబ్బారావుగారు బట్టల వర్తకంలో మిషను పని చూసుకునేవాడు. అన్నీ ఖర్చులు పోనూ నెలకి వంద రూపాయలు మిగులుతాయి. మొదట ఒకరి చేతికింద పని చేసినా , ఇప్పుడు నలుగుర్ని పోషించే స్థాయికి ఎదుగుతాడు.